పెద్ద నోట్ల రద్దు సమంజసమే

madras4నోట్ల రద్దుపై దాఖలైన పిటిషన్‌ను గురువారం విచారణ జరిపిన మద్రాస్‌ హైకోర్టు కొట్టివేసింది. పెద్ద నోట్ల రద్దు సమంజసమేనని, ప్రధాని నరేంద్రమోదీ సరైన నిర్ణయమే తీసుకున్నారని న్యాయస్థానం పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ నిర్ణయాల్లో జోక్యం చేసుకోమని, మోదీ మంచి నిర్ణయమే తీసుకున్నారని న్యాయస్థానం తెలిపింది. కొత్తగా వచ్చిన నోట్లు కూడా బాగున్నాయని కోర్టు పేర్కొంది. నోట్ల రద్దుతో సామాన్య, పేద ప్రజలకు ఇబ్బందులు వస్తాయని పేర్కొంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. మంగళవారం రాత్రి ప్రధానమంత్రి రూ. 500, 1000 నోట్లను రద్దు చేస్తూ ప్రకటించిన విషయం తెలిసిందే.