పెన్షన్ ఐ.డీ.కార్డుల పంపిణీ

 

రామకృష్ణాపూర్ (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశముల మేరకు క్యాతనపల్లి మునిసిపాలిటీ కార్యాలయము నందు ప్రభుత్వము మంజూరీ చేసిన పెన్షన్ ఐ.డి. కార్డులను గౌరవ చైర్ పర్సన్ జంగం కల
చేతుల మీదులుగా లబ్ది దారులకు పంపిణీ చేయడము జరిగినది.
ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్పర్సన్ మాట్లాడుతూ కేసీఆర్ పేదల పక్షపాతి అని, అను నిత్యం ప్రజల ఆకాంక్ష కై శ్రమించే మహోన్నత వ్యక్తిగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో కమీషనర్ జీ.వెంకట నారాయణ, వైస్ చైర్మన్ అర్రం విద్యా సాగర్ రెడ్డి, కౌన్సిలర్లు పుల్లూరి సుదాకర్, రేవెల్లి ఓదెలు, తిరుపతి పారిపెల్లి, జాడి శ్రీనివాస్, గడ్డం విజయ లక్ష్మి, రామిడి ఉమాదేవి, బోయినపల్లి అనిల్ కుమార్, పార్వతి విజయ, కో-ఆప్షన్ సభ్యులు యాకూబ్ అలీ, రజియా సుల్తానా, మేనేజర్ కె. నాగరాజు, రెవెన్యూ ఆఫీసర్ పి.కృష్ణప్రసాద్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ ఏ.అచ్యుత్, ఇంచార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ ఈ.వసంత్, కార్యాలయ సిబ్బంది, మెప్మా రిసోర్స్ పర్సన్స్, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.