పేదింటి బిడ్డల పెండ్లికి సర్కారు సాయం -పరిగి ఎమ్మెల్యే

మహబుబ్ నగర్ ,అగస్ట్ 19,(జనంసాక్షి ) : తెలంగాణ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల పేదప్రజల పక్షపాతిగా వారి సంక్షేమానికి నిత్యం పాటుపడుతుందని పరిగి  ఎమ్మెల్యే కొప్పుల మహెష్ రెడ్డి తెలిపారు. శుక్రవారం గండీడ్  మండలకేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పెళ్లిళ్ల సమయంలో పేద కుటుంబాలు అప్పులపాలు కాకుండా అన్ని వర్గాల ఆడపిల్లల పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్ పథకాలతో ప్రభుత్వం చేయూతనిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఎంపిపి మాధవి రాజకుమార్ రెడ్డి ,జడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి ,వైస్ ఎంపిపి ఈశ్వరయ్య గౌడ్ ,అదికారులు ఎంపిడిఓ రుపేందర్ రెడ్డి ,ఎంఅర్వో జ్యొతి ,పెద్దవార్వాల్ సర్పంచ్ లలితా చెన్నారెడ్డి ,  మరియు అయాగ్రామాల సర్పంచులు ,లబ్ధిదారులు
పాల్గొన్నారు .