పేద కుటుంబానికి మేలు చేసేలా బిఆర్ఎస్ మేనిఫెస్టో..!

ఎంపీపీ రాచకొండ లక్ష్మీ, బీఆర్ఎస్ అధ్యక్షుడు పిన్ రెడ్డి కిషన్ రెడ్డి
జనంసాక్షి, కమాన్ పూర్, అక్టోబర్ 27 : రాష్ట్రంలోని ప్రతిపేద కుటుంబానికి మేలు జరిగేలా బీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల మేనీఫెస్టోకు సీఎం కేసీఆర్‌ రూపకల్పన చేశారని ఎంపీపీ రాచకొండ లక్ష్మీ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పిన్ రెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. కమాన్‌పూర్‌ మండలంలోని గుండారం, పెంచికల్ పేట్, బుర్రకాయల పల్లె లో శుక్రవారం గడప గడపకు బీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల మేనీఫెస్టో కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రభుత్వం అమలు చేస్తున్నపథకాలపై అవగాహన కల్పించారు. రాబోయే ఎన్నికల్లో మంథని ఎమ్మెల్యేగా పుట్ట మధును గెలిపించి అసెంబ్లీకి పంపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు తాటికొండ శంకర్, కొండ వెంకటేష్, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గడప కృష్ణమూర్తి, మండల బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు బొమ్మగాని అనిల్ గౌడ్, గుండారం ఉప సర్పంచ్ రాచకొండ చంద్రమౌళి, బీఆర్ఎస్ గ్రామశాఖ యూత్ అధ్యక్షులు దండే కిషన్, కుందారపు సత్యం, ఎద్దు రాజయ్య, మహిళ నాయకురాలు ఆవునూరి భాగ్య, నాయకులు రాచకొండ రవి, గొడిశెల సంపత్, దామెర సంపత్, సిరవేని వేణు, బంగారు గట్టయ్య, ఆకుల గట్టయ్య, గాదె సది, బొల్లపల్లి శంకర్ గౌడ్, బోయిని బాలకృష్ణ, మల్యాల భాస్కర్, ఆకుల తిరుపతి, దాసరి శ్రీనివాస్, దండే రమేష్, పిట్టల స్వామి, దండే ప్రదీప్, పిడుగు గట్టయ్య ఆకుల నారాయణ, బైరీ అంజయ్య, అనవేన నర్సయ్య, తీగల వెంకటేష్, ఐట్ల పవన్ కళ్యాణ్, సిద్ధ వెంకటేష్, ఆకనపల్లి సుధాకర్ గౌడ్, పిడుగు శ్రీనివాస్, మబ్బు హరిక్రిష్ణ, ఎంబడి శ్రీకాంత్, అనవేన రవి, నామని రాజలింగు, తాటికొండ హరీష్, హరీష్, ప్రశాంత్, నగేష్, బిళ్ళ హరీష్, సాన సురేష్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.