పేద ప్రజలకు అండగా టిఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు

 ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి
జులై 15( జనం సాక్షి): వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండల కేంద్ర పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందినటువంటి పెంటల చెన్నయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించడం జరిగింది. అతనిపై పట్టా భూమి ఉండడంతో కెసిఆర్ ప్రవేశపెట్టిన రైతు బీమా పథకం ఉండటం ద్వారా అతని కుటుంబానికి పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి చొరవ తీసుకొని రైతు బీమా ద్వారా వచ్చే డబ్బులను ఐదు లక్షల రూపాయల చెక్కును ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి చేతుల మీదగా కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక జడ్పిటిసి ఆధ్వర్యంలో రాందాస్ నాయక్, ఎంపీపీ సత్య హరిచంద్ర, చౌడపూర్ మండల టిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ నాగరాజు, శ్రీకాంత్ రెడ్డి, గ్రామ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు, రమేష్, అంజయ్య గౌడ్, చెన్నయ్య,చంద్రయ్య,హన్మంత్, శ్రీనివాసులు, వెంకటయ్య మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.
Attachments area