పేద ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న దళిత బంధు పథకం

– ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి
జులై    ( జనం సాక్షి): వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండల కేంద్రానికి చెందినటువంటి పరిగి శ్రీను కు దళిత బంధు పథకంలో భాగంగా స్వరాజ్ ట్రాక్టర్ ను లబ్ధిదారుడుకు ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి చేతుల మీదగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి మాట్లాడుతూ… దళిత బంధు పథకం ద్వారా నిరుపేద కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నారు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు కొప్పుల అనిల్ రెడ్డి, స్థానిక జడ్పిటిసి రాందాస్ నాయక్, ఎంపీపీ సత్యహరిచంద్ర, సొసైటీ వైస్ చైర్మన్ నాగరాజు, చౌడపూర్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, స్థానిక ఎంపిటిసి శంకర్, స్థానిక సర్పంచ్ కొత్త రంగారెడ్డి, వార్డు మెంబర్లు అశోక్,రామకృష్ణ,నర్సింలు, ప్రభు, యాదయ్య, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.
Attachments area