పేద ప్రజలు ప్రభుత్వం సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి కే.పాండు యాదవ్

బోయిన్ పల్లి ఆరోవ వార్డ్ పరిధిలో తాడబండ్, తావాయిపుర, సీతారాంపురం లో ఆసరా పెన్షన్ కార్డు ఇంటింటికి తిరుగుతూ పంపిణీ చేసిన బోర్డు మాజీ సభ్యుడు కే.పాండు యాదవ్ కార్యక్రమంలో వంద సంవత్సరాలు వృద్ధురాలు అయిన బాలామణి కి ఇంటిలో లేవా లేని స్థితిలో ఉన్న తన ఆసరా పెన్షన్ కార్డు పాండు యాదవ్ ఆమెకు అందించారు, అదేవిధంగా బస్తీలో వ్యక్తి కి రోడ్ యాక్సిడెంట్ లో కాలుకు దెబ్బ తగిలిన పేషెంట్ తన ఆరోగ్య గురించి తెలుసుకున్ని ఆర్థిక సాయం అందించారు, బస్తీలో సమస్యల గురించి అడిగి తెలుసుకున్ని వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు, అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ ఎం.విశ్వనాథ్, చిన్ని కృష్ణ, జయరాం తదితరులు పాల్గొన్నారు.