పోర్న్ వీడియోలు చూపించి రేప్.. ఆపై హత్య
పనాజీ : గోవాలో దారుణంగా హత్యకు గురైన సుగంధ ద్రవ్యాల వ్యాపారస్తురాలు మైనికా గుర్డేను చంపింది సెక్యూర్టీ గార్డ్ అని పోలీసులు తేల్చేశారు. 21 ఏళ్ల రాజ్ కుమార్ సింగ్ను ఈ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్నాటక పోలీసుల ఆధారంగా అతన్ని బెంగుళూర్లో పట్టుకున్నారు. అతన్ని గోవాలోని మపూసా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. నిందితుడు రాజ్ కుమార్ స్వస్థలం పంజాబ్లోని బటిండా. అయితే మోనికా మృతి తర్వాత ఆమె ఏటిఎమ్ కార్డు నుంచి డబ్బును రాజ్కుమార్ మూడుసార్లు డ్రా చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత అతని మొబైల్ ఫోన్ను కూడా పోలీసులు ట్రాక్ చేశారు. దాని ఆధారంగా గోవా పోలీసులు నిందితున్ని చాకచక్యంగా పట్టుకున్నారు. మోనికాకు చెందిన ఏటిఎమ్ కార్డు ద్వారా నిందితుడు సుమారు లక్ష రూపాయాలు డ్రా చేశాడు. పర్ఫ్యూమ్ వ్యాపారస్తురాలు మోనికాను చంపింది తానే అని నిందితుడు విచారణలో ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.
సంగోల్డా గ్రామంలో ఉన్న త్రీ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో గత గురువారం మోనికా శవమై తేలిన విషయం తెలిసిందే. బెడ్పై ఆమె శరీరం పడి ఉంది. ఆమె చేతులు, కాళ్లు బెడ్కు కట్టేసి ఉన్నాయి. పోస్ట్మార్టమ్ రిపోర్ట్ ప్రకారం ఆమె అత్యాచారానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. చాలా ప్రణాళిక ప్రకారం మోనికా హత్య జరిగిందని డీఐజీ విమర్ గుప్తా విలేకర్ల సమావేశంలో తెలిపారు. సంగోల్డాలో ఉన్న సప్నా రాజ్ వ్యాలీ అపార్ట్మెంట్లో కొత్తగా దిగిన మోనికాతో సెక్యూర్టీ గార్డ్ ఉన్న రాజ్కుమార్ తో పరిచయం అయింది. అయితే ఆమె రూమ్ కోసం వెతుకుతున్నప్పుడు ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ సమయంలోనే మోనికాపై నిందితుడు మోజు పెంచుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఒంటరిగా ఉన్న ఆమె గురించి నిందితుడు ఎప్పుడూ ఫాలో చేసేవాడు. అయితే గొడుగు కోసం మోనికా చేసిన ఫిర్యాదు వల్ల నిందితుడు తన ఉద్యోగాన్ని కోల్పోయేలా చేసింది. గతంలో కూడా సెక్యూర్టీ గార్డ్ రాజ్ కుమార్పై అపార్ట్మెంట్లో చాలా ఫిర్యాదులు వచ్చాయి. అయితే మోనికా ఇచ్చిన ఫిర్యాదు తర్వాత నిందితున్ని ఉద్యోగం నుంచి తీసేశారు. ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని నిందితుడు మోనికాను పదేపదే వేడుకున్నాడు. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. దీంతో అతను ఆమెపై పగ పెంచుకున్నాడు.
గత గురువారం సాయంత్రం మోనికా ఇంటికి వచ్చిన నిందితుడు ఆమెను కత్తితో బెదిరించాడు. ఆ తర్వాత ఆమెపై దాడి చేసి స్పృహ కోల్పోయేలా చేశాడు. ఆమె కాళ్లను, చేతులను మంచానికి కట్టేశాడు. ఆమె పర్స్ నుంచి నాలుగు వేలు నగదు తీసుకున్నాడు. డెబిట్ కార్డు లాక్కున్న అతను ఆమెను బెదిరించి దాని పాస్వర్డ్ కూడా తెలుసుకున్నాడు. అత్యాచారం చేసిన తర్వాత డెబిట్ కార్డు, మొబైల్ ఫోన్తో నిందితుడు పరారైనట్లు పోలీసులు తెలిపారు.
సంగోల్డా గ్రామంలో ఉన్న త్రీ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో గత గురువారం మోనికా శవమై తేలిన విషయం తెలిసిందే. బెడ్పై ఆమె శరీరం పడి ఉంది. ఆమె చేతులు, కాళ్లు బెడ్కు కట్టేసి ఉన్నాయి. పోస్ట్మార్టమ్ రిపోర్ట్ ప్రకారం ఆమె అత్యాచారానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. చాలా ప్రణాళిక ప్రకారం మోనికా హత్య జరిగిందని డీఐజీ విమర్ గుప్తా విలేకర్ల సమావేశంలో తెలిపారు. సంగోల్డాలో ఉన్న సప్నా రాజ్ వ్యాలీ అపార్ట్మెంట్లో కొత్తగా దిగిన మోనికాతో సెక్యూర్టీ గార్డ్ ఉన్న రాజ్కుమార్ తో పరిచయం అయింది. అయితే ఆమె రూమ్ కోసం వెతుకుతున్నప్పుడు ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ సమయంలోనే మోనికాపై నిందితుడు మోజు పెంచుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఒంటరిగా ఉన్న ఆమె గురించి నిందితుడు ఎప్పుడూ ఫాలో చేసేవాడు. అయితే గొడుగు కోసం మోనికా చేసిన ఫిర్యాదు వల్ల నిందితుడు తన ఉద్యోగాన్ని కోల్పోయేలా చేసింది. గతంలో కూడా సెక్యూర్టీ గార్డ్ రాజ్ కుమార్పై అపార్ట్మెంట్లో చాలా ఫిర్యాదులు వచ్చాయి. అయితే మోనికా ఇచ్చిన ఫిర్యాదు తర్వాత నిందితున్ని ఉద్యోగం నుంచి తీసేశారు. ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని నిందితుడు మోనికాను పదేపదే వేడుకున్నాడు. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. దీంతో అతను ఆమెపై పగ పెంచుకున్నాడు.
గత గురువారం సాయంత్రం మోనికా ఇంటికి వచ్చిన నిందితుడు ఆమెను కత్తితో బెదిరించాడు. ఆ తర్వాత ఆమెపై దాడి చేసి స్పృహ కోల్పోయేలా చేశాడు. ఆమె కాళ్లను, చేతులను మంచానికి కట్టేశాడు. ఆమె పర్స్ నుంచి నాలుగు వేలు నగదు తీసుకున్నాడు. డెబిట్ కార్డు లాక్కున్న అతను ఆమెను బెదిరించి దాని పాస్వర్డ్ కూడా తెలుసుకున్నాడు. అత్యాచారం చేసిన తర్వాత డెబిట్ కార్డు, మొబైల్ ఫోన్తో నిందితుడు పరారైనట్లు పోలీసులు తెలిపారు.