పోలవరం పూర్తికి కేంద్రం సహకరిస్తుంది

విజయవాడ,మార్చి9(జ‌నంసాక్షి): వచ్చే అయిదేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి తీరుతామని ఆంధప్రదేశ్‌ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ పునరుద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వ సహకరాంతో దీనిని పూర్తి చేస్తామని అన్నారు. పోలవరం నిర్మాణానికి సాధ్యమైనన్ని నిధులను కేంద్రం నుంచి తీసుకురావడానికి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. హైదరాబాద్‌కు వెళ్లే ముందు ఇక్కడ తనను కలసిన విూడియాతె మాట్లాడుతూ పోలవరంపై ఆందోళన తగదన్నారు. రైతు సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయన్నారు. ఎన్నికల ముందు ఏపీ అభివృద్ధి విషయంలో ప్రధాని మోదీ ఇచ్చిన హావిూలు తప్పకుండా నెరవేరుతాయన్నారు.