పోలవరానికి తొలగిన అడ్డంకులు

న్యూఢిల్లీ,జూలై9(జ‌నం సాక్షి): పోలవరం ప్రాజెక్ట్‌ పనులకు ప్రధాన అడ్డంకి తొలగింది. పోలవరం పనుల నిలిపివేత ఆదేశాలపై ఉన్న స్టే ను మరో ఏడాదిపాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్థన్‌ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలతో పోలవరం పనులకు ఎలాంటి అంతరాయం తలెత్తకుండా మార్గం సుగమం అయింది.