పోలింగ్ బూత్ లలో అందుబాటులో ఓటరూ జాబితా

వనపర్తి బ్యూరో: నవంబర్ 9 (జనం సాక్షి) పోలింగ్ బూత్ లలో అందుబాటులో ఓటరు జాబితాను జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ వనపర్తి జిల్లా పరిధిలోని అన్ని పోలింగ్ బూత్లలో కొత్తగా రూపొందించిన ముసాయిదా ఓటర్ జాబితాను అందుబాటులో ఉంచినట్లు జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ తెలిపారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో జిల్లాలలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో, కలిసి ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఓటరు జాబితాలో ఏవైనా పొరపాట్లు ఉంటే వాటిని గుర్తించి అధికారుల,దృష్టికి తీసుకురావాలని ఫోటోలతో ఉన్న ఈ జాబితాలో ఫోటో మార్పిడి లాంటి సమస్యలు తలెత్తితే వెంటనే సంబంధిత అధికారులకు, తెలియజేయాలని ఆయన సూచించారు.అదేవిధంగా ఓటర్ గుర్తింపు కార్డు కు ఆధార్ తప్పకుండా అనుసంధానం చేసే కార్యక్రమాన్ని 100% పూర్తి చేయాలన్న అధికారులను, ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ టిఆర్ఎస్ గట్టు యాదవ్, ఐ ఎన్ సి.,జనార్దన్ సిపిఐ,పరమేశ్వర చారి, బీఎస్పీ నాగనముని చెన్నా రాములు, టిడిపి సయ్యద్ జమీలుద్దీన్, ఆల్ ఇండియా మజ్లిస్ ఈ ఇతిహాస్ ఉల్ ముస్లిం మిన్ ఎంఏ రహీం, వైఎస్ఆర్స్  వెంకట్వర్లు,సమజ్ వాది పార్టీ రాములు, టీజే.ఎస్ ఎంఏ ఖాదర్, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.