పోలీసు అమరుల త్యాగాలు మారువలేనివి ఆత్మకూరు సబ్ఇన్స్పెక్టర్ మధు

ఆత్మకూర్ (ఎం) అక్టోబర్ 21 (జనంసాక్షి) ఆత్మకూరు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ అమరులైన పోలీసుల చిత్ర పటాలకు ఎస్ ఐ మధు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎస్ ఐ మధు మాట్లాడుతూ శాంతి భద్రత పరిరక్షణ కోసం విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలు మారువలేనివి అని గుర్తు చేశారు అమరులైన పోలీసులు ప్రజల గుండెల్లో చిరకాలం వుంటారు అని అన్నారు ఈ కార్యక్రమంలో కానిస్టేబుళ్లు మహిళ కానిస్టేబుళ్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు