పోలీసు సమయస్ఫూర్తి..ప్రాణాలతో బయటపడ్డ మహిళ

train-accidentరైలు ఆగకముందుకే దిగబోయిన మహిళ.. రైలు కింద పడబోతుంటే సమయస్ఫూర్తితో ఆమెను క్షణాల్లోనే బయటకు లాగడంతో ప్రాణాలతో బయటపడింది. ఈ సంఘటన పుణెలోని లోనావాలా రైల్వే స్టేషన్లో జరిగింది. కాకినాడ ఎక్స్ ప్రెస్ పుణె నుంచి ముంబైకి  వెలుతోంది. లోనావాలా స్టేషన్ కు రాగానే ట్రైన్ ఆగక ముందే ఓ యువతి, యువకుడు ఫ్లాట్ ఫాం పైకి దూకారు. ఆ సందర్భంలో మహిళ ట్రైన్ కిందకు దూసుకు పోతుండగా .. అక్కడే విధులు నిర్వహిస్తున్న పవన్ అనే కానిస్టేబుల్ సమయస్పూర్తితో ఆమెను బయటకు లాగాడు. దీంతో ఆమె స్వల్పగాయాలతో బయటపడింది. తర్వాత ఆమెను  చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.