పోలీస్ అమరుల త్యాగాలు మరువలేనివి, వారికి శోకతప్త హృదయంతో శ్రద్ధాంజలి

జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్

సమాజం, భవిష్యత్ తరాలు, ప్రజా రక్షణ కోసం పోలీసులు అహర్నిశలు తమ ప్రాణాలను లెక్కచేయకుండా శాంతిభద్రతలే లక్ష్యం

– జిల్లా ఎస్పీ కే మనోహర్

నాగర్ కర్నూల్ జిల్లా బ్యూరో అక్టోబర్ 21 జనం సాక్షి:
విధి నిర్వహణలో అశువులు బాసిన పోలీసు అమరుల త్యాగాలు, సేవలు మరువలేనివని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్‌ పి.ఉదయ్ కుమార్ అన్నారు.
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సంధర్బంగా శుక్రవారం నాగర్ కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలోని పేరడ్‌ మైదానంలో అమరవీరుల స్ధూపం వద్ద స్మృతి పరేడ్‌ నిర్వహించారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.
జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ మాట్లాడుతూ…. పోలీసు అమరవీరులను శోకతప్త హృదయంతో స్మరించుకుంటూ పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించుకుంటామన్నారు.
గత సంవత్సరం దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో 264 మంది అసువులు బాసిన పోలీసులను స్మరించుకోవడం మన బాధ్యత అన్నారు.
1959 అక్టోబర్‌ 21న జరిగిన దురదృష్ట సంఘటనను గుర్తు చేసుకుంటూ వారి త్యాగాలను స్మరణం చేసుకోవడం కోసం ప్రతి ఏటా ఈ రోజున పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు.
పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం అందరి బాధ్యత అన్నారు.
పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేమన్నారు. శాంతి భద్రతల కట్టడిలో పోలీస్‌ వ్యవస్థ చాలా కీలకంగా పనిచేస్తుందన్నారు.
విపత్కర పరిస్థితుల్లో పోలీసులు పోలీసులు కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ విధులు నిర్వహిస్తారన్నారు. సమాజం ఎప్పుడూ గుర్తుంచుకుంటుందన్నారు.
జిల్లా ఎస్‌పి కే. మనోహర్ మాట్లాడుతూ….దేశ కోసం ఎంతో మంది జవాన్లు తమ ప్రాణాలను అర్పించారన్నారు. ప్రజా రక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల – త్యాగనిరతిని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్‌ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా పాటిస్తున్నామన్నారు. విధి నిర్వహణలో భాగంగా గత సంవత్సరం 264 మంది వీరయోధులు మృతిచెందారన్నారు. లా అండ్ ఆర్డర్ నియంత్రణలో గతంలో నాగర్ కర్నూలు జిల్లాలోనూ విధినిర్వహణలో పోలీసులు అనేకమంది వీర యోధులుగా మృతి చెందారన్నారు. సమాజం కోసం, భవిష్యత్తు తరాల కోసం, ప్రజా రక్షణ కోసం పోలీసులు అహర్నిశలు తమ ప్రాణాలను లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్నారన్నారు ప్రజాశ్రేయస్సు, శాంతి భద్రతలే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామన్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా పోలీసులు తమ ప్రాణాలను ఒడ్డి విధులు నిర్వహిస్తున్నారని, పోలీసులకు ప్రజల సహకారం చాలా అవసరమన్నారు. జిల్లాలోని పోలీసులు అండగా ఉంటూ అనేక రకాలుగా వారిని ఆదుకుంటామన్నారు. పోలీసులు పడుతున్న కష్టాన్ని శ్రమను గుర్తిస్తే వారికి అదే సంతోషం ఇస్తుందన్నారు.
దేశ వ్యాప్తంగా విధి నిర్వహణలో వీరమరణం పొందిన 264 మంది పోలీసుల పేర్లను అడిషనల్ ఎస్పీ సిహెచ్ రామేశ్వర్ చదివి వినిపించారు. అందరికి శ్రద్ధాంజలి ఘటిస్తూ, నివాళులర్పించి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు.
అమరులైన పోలీసు కుటుంబ సభ్యులకు శాలువాతో సత్కరించి, వారి సమస్యలను విన్నారు.
సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పెద్దపల్లి పద్మావతి జిల్లా ఎస్‌పి మనోహర్ అమరుల కుటుంబాలతో కలిసి ఎస్పీ కార్యాలయం నుండి అంబేద్కర్ కూడలి వరకు ర్యాలీని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో
జిల్లా పరిషత్ చైర్పర్సన్ పెద్దపల్లి పద్మావతి బంగారయ్య, జిల్లా అదనపు ఎస్పీ సిహెచ్ రామేశ్వర్, జిల్లా ఏఆర్ ఏఎస్పీ భరత్ కుమార్, అచ్చంపేట డిఎస్పి కృష్ణ, పలువురు
సిఐలు, ఆర్‌ఐలు, పోలీసు అధికారుల సంఘం నాయకులు పోలీసు కుటుం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.