ప్రణబ్‌తో బంగ్లాదేశ్‌ విపక్ష నేత భేటీ రద్దు

ఢాకా : భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పర్యటన బంగ్లాదేశ్‌లో నిన్న ప్రారంభమైంది. జమాతే ఇస్లామీ నేతకు ఉరిశిక్ష విధింపుతో బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష నేత బేగమ్‌ ఖలేదా జియా ప్రణబ్‌ముఖర్జీతో భేటిని రద్దు చేసుకున్నారు. భద్రతా కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు బంగ్లాలో చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనల్లో మృతుల సంఖ్య 76కి చేరింది.