ప్రణబ్‌ ఫోటోల మారన్ఫింగ్‌

సోషల్‌ విూడియాలో చక్కర్లు

న్యూఢిల్లీ,జూన్‌8(జనం సాక్షి ): ఆర్‌.ఎస్‌.ఎస్‌ కార్యక్రమానికి హాజరైన మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మార్ఫింగ్‌ ఫోటోలు సోషల్‌ విూడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సంఘ్‌ శిక్షా వర్గ్‌ కార్యక్రమం ముగింపు సందర్భంగా ఆర్‌.ఎస్‌.ఎస్‌ నేతలతో ప్రణబ్‌ వేదిక పంచుకున్నారు. ఇదే సమయంలో ఆర్‌.ఎస్‌.ఎస్‌ నేతలు ప్రతిజ్ఞ చేసినప్పటికీ ప్రణబ్‌ మాత్రం మామూలుగానే నిలబడ్డారు. కానీ ప్రణబ్‌?ఆర్‌.ఎస్‌.ఎస్‌ టోపీ పెట్టుకున్నట్లు ఆయన ప్రతిజ్ఞ చేస్తున్నట్లు ఫోటోలు ప్రత్యక్షమయ్యాయి. ఈ మార్ఫింగ్‌ ఫోటోలపై ప్రణబ్‌ కుమార్తె శర్మిష్ట రియాక్టయ్యారు. ఇలాంటిది జరుగుతుందని తాను ముందే చెప్పానంటూ బీజేపీపై విమర్శలు చేశారు. నాగ్‌పూర్‌ ఆరెస్సెస్‌ సభలో ప్రణబ్‌ ముఖర్జీ చేసిన ప్రసంగాన్ని అందరూ మర్చిపోతారని, ఫొటోలు, వీడియోలు మాత్రమే గుర్తుంటాయని ఆమె ముందే చెప్పారు. తాజాగా ఘటనపై శర్మిష్ట మరో ట్వీట్‌ చేశారు. దీని గురించే నేను భయపడ్డాను. మా నాన్న మాట్లాడిన కొన్ని గంటలకే బీజేపీ ట్రిక్స్‌ విభాగం చురుగ్గా పనిచేసిందని విమర్శించారు. అటు ప్రణబ్‌ ప్రసంగంపై కాంగ్రెస్‌ నేతలు ప్రశంసలు కురిపించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సభలో కాంగ్రెస్‌ సిద్దాంతాలను గురించి ప్రస్తావించడం బాగుందని ఆ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం అన్నారు. కొన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్దాంతాలు తప్పు అని ఆయన చెప్పడం చక్కగా ఉందన్నారు. ఆనంద్‌శర్మ, రణ్‌దీప్‌ సుర్జేవాలా కూడా ప్రణబ్‌ ప్రసంగాన్ని మెచ్చుకున్నారు. భారత్‌లోని భిన్నత్వాన్ని, సహనాన్ని, లౌకికవాదాన్ని ప్రణబ్‌ గుర్తు చేశారని చెప్పారు. ఇకనైనా ఆర్‌.ఎస్‌.ఎస్‌, బీజేపీ తమ స్వభావాన్ని మార్చుకోవాలని కాంగ్రెస్‌ నేతలు కోరారు.