*ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలి- మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మారెడ్డి*

రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి) :  ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలని శంషాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మారెడ్డి పిలుపునిచ్చారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో కలిసి శనివారం స్కూల్ నుండి ర్యాలీగా బయలుదేరిన శంషాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మారెడ్డి
ఈ సందర్భంగా మాట్లాడుతూ
నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా త్రివర్ణ పతాకాలు ప్రజలకు అందించనుందని తెలిపారు.జాతీయ జెండాలను గ్రామ గ్రామాన ఇంటి పై ఆవిష్కరించాలని సూచించారు. స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ 75 సంవత్సరాల వజ్రోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. స్వతంత్ర పోరాటంలో ఎందరో మహానుభావులు అమరులయ్యారన్నారు వారి స్మృతిని గుర్తు చేసుకుంటూ వజ్రోత్సవాలను జరుపుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఈ నరేష్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ అనిల్ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థి విద్యార్థులు, నగర్ దీపికలు, స్థానిక నాయకు తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్ : మున్సిపల్ కార్యాలయం వద్ద విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మారెడ్డి.