ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు చేయాలి

డివిజన్ ఆరోగ్య బోధకుడు దస్తీ రాం
జుక్కల్, పిబ్రవరి 15, (జనం సాక్షి ),
ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు జరపాలని డివిజన్ ఆరోగ్య బోధకుడు దస్తీరాం కంటి వెలుగు సిబ్బందికి సూచించారు. ఆయన బుధవారం కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలం కాటేపల్లి గ్రామంలో కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించారు. కంటి వెలుగు శిబిరానికి వచ్చే కంటి రోగుల హాజరు శాతాన్ని ,ఆన్ లైన్,ఆఫ్ లైన్ రికార్డులను ఆయన పరిశీలించారు. కళ్ళద్దాల పంపిణీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ సంగీత, కంటి వైద్యులు నాగరాజు, డిఈఓ నవనీత, గ్రామ పంచాయతి కార్యదర్శి భూపల్లి ప్రదీప్,గ్రామ రెవిన్యూ సహాయకులు నీరుడి శంకర్, ఏఎన్ యం లు జి. లక్ష్మి, అంజలి, ఎం ఎల్ హెచ్ పి లు సాయిబాబా, తేజ, ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు