ప్రతి పంటల వివరాలు నమోదు చేయాలి

రాజోలి 24 ఆగస్టు (జనం సాక్షి)
రైతులు సాగు చేస్తున్న ప్రతి పంటను తప్పనిసరిగా నమోదు చేయాలని వ్యవసాయ సహాయ సంచాలకులు సక్రియం నాయక్ అన్నారు.మండలంలో తుమ్మిళ్ల,మన్ దొడ్డి గ్రామంలో ఆయన బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు.రైతులు సాగులో వాడుతున్న విధానాలు అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అందుబాటులో ఉంటారని సాగుకు సబందించిన అన్ని సమాచారాలు అందచేస్తారని తెలిపారు. పలు సలహాలు సూచనలు అందించిన అనంతరం ఆయన పంటల వివరాల ప్రాముఖ్యత ను తెలియచేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి చంద్ర శేఖర్, ఏ ఈ ఓ దిరజ్ ప్రత్యేక అధికారి తేజోవతి రైతులు పాల్గొన్నారు.