ప్రత్యేక హోదాపై రాజ్యసభలో చర్చ
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై రాజ్యసభలో చర్చ ప్రారంభమైంది. కాంగ్రెస్ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ చర్చను మొదలుపెట్టారు. చర్చ అనంతరం కేంద్రఆర్థికమంత్రి అరుణ్జైట్లీ సమాధానం ఇవ్వనున్నారు. కేవలం అరగంట పాటు చర్చ జరుగనుంది. నిన్న జరిగిన చర్చ అసంపూర్ణంగా ముగియడంతో నేడు మరోసారి చర్చించాలని రాజ్యసభ బిజెనెస్లో నిర్ణయించారు.