ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ భేటీ

న్యూఢిల్లీ : ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. ప్రధాని నరేంద్ర మోదీతో ఇవాళ మధ్యాహ్నం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్.. రాష్ర్టానికి సంబంధించిన పలు అంశాలపై చర్చిస్తున్నారు. కొత్త జోనల్ విధానం, ఎస్టీ, ముస్లింల రిజర్వేషన్ల పెంపు అంశంపై సీఎం కేసీఆర్ ప్రధాని మోదీతో చర్చించనున్నారు. రిజర్వేషన్ల పెంపును ఆమోదించాలని కేంద్రాన్ని సీఎం కోరనున్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, హైకోర్టు విభజన, విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను సీఎం కేసీఆర్ ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు. పంటకు మద్దతు ధర పెంచాలని ప్రధానిని కోరనున్నారు. ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానించాలని ప్రధానికి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేయనున్నారు.