ప్రధాని, హోంమంత్రి వివరణ ఇవ్వాల్సిందే!

స్నూపింగ్ వ్యవహారంపై పార్లమెంట్ ఉభయసభల్లో కాంగ్రెస్ నిరసనకు దిగింది. రాహుల్ గాంధీపై మోడీ ప్రభుత్వం రాజకీయ గూఢచర్యానికి పాల్పడిందని ఫైరయింది. స్నూపింగ్ పై ప్రధాని, హోంమంత్రి వివరణ ఇవ్వాలని లోక్ సభలో కాంగ్రెస్ పక్షనేత మల్లిఖార్జున ఖర్గే, రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ డిమాండ్ చేశారు. అటు అధికార బీజేపీ మాత్రం కాంగ్రెస్ ఆరోపణలను తోసిపుచ్చింది. రోటీన్ ప్రాసెస్ లో భాగంగానే ఢిల్లీ పోలీసులు రాహుల్ ప్రొఫార్మా సేకరించారని… ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు వివరణ ఇచ్చారు. ఐనా శాంతించని కాంగ్రెస్ ప్రధాని, హోంమంత్రి వివరణ కోసం పట్టుబట్టింది.