ప్రపంచంలో మేటి తత్వవేత్త పూలే

5

-సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 10 (జనంసాక్షి):

ఆడ పిల్లల చదువును ఒక ఉద్యమంలా చేపట్టి మహాత్మాజ్యోతిరావు పూలే 19వ శతాబ్దంలోనే చేసిన ఆలోచనలు ప్రపంచ మేటి తత్వవేత్తల సరసన పూలేను నిలబెట్టాయని సీఎం కేసీఆర్‌  కొేనియాడారు.  సమాజంలోని అంతరాలను తొలగించడానికి కృషి చేసిన తొలి తరం మహానీయుడిగా మహాత్మాజ్యోతిరావు పూలే చరిత్రలో నిలిచిపోతారని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ఆయన త్యాగాలు ఎందరికో బాటచూపాయన్నారు. ఈ నెల 11న పూలే జయంతి సందర్భంగా సీఎం ఆయన సేవలను గుర్తు చేశారు. మానవీయ లక్షణాలు పెంపొందించడానికి సమాజంలో వివిధ వర్గాల వారి అభ్యున్నతికి పూలే బాటలు వేశారు.