ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ నుంచి.. 

సైనా నిష్కమణ
– మారిన్‌ చేతిలో ఘోర పరాజయం
బీజింగ్‌, ఆగస్టు3(జ‌నం సాక్షి) : ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత అగశ్రేణి బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ ఘోర పరాజయం పాలైంది. తనకు ఎంతో కలిసి వచ్చిన టోర్నీలో సైనా క్వార్టర్స్‌ నుంచే నిష్కమ్రించింది. ఏ దశలోనూ సైనా తన పోరాట పటిమను ప్రదర్శించలేకపోయింది. అనవసర తప్పిదాలు చేసింది. మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో భాగంగా సైనా.. స్పెయిన్‌ క్రీడాకారిణి కరోలినా మారిన్‌తో తలపడింది. సైనా-మారిన్‌ మధ్య పోరు ¬రా¬రీగా సాగుతుందని అభిమానులు అనుకున్నారు. కానీ, శుక్రవారం జరిగిన పోరులో మారిన్‌దే పూర్తిగా పైచేయి సాధించింది. ఏ దశలోనూ మారిన్‌కు సైనా పోటీనివ్వలేకపోయింది. దీంతో ఆమె ఘోర ఓటమిని చవిచూసి టోర్నీ నుంచి నిష్కమ్రించాల్సి వచ్చింది. 31 నిమిషాల పాటు జరిగిన పోరులో మారిన్‌ 21-6, 21-11తో గెలిచి సెవిూస్‌లో అడుగుపెట్టింది.మరోపక్క మిక్స్‌డ్‌ డబుల్స్‌లోనూ భారత జోడీ ఇంటిముఖం పట్టింది. ప్రపంచ రెండో ర్యాంకర్‌, టాప్‌ సీడ్‌ హువాంగ్‌-జెంగ్‌ సీవీ(చైనా) చేతిలో 21-17, 21-10 తేడాతో సాత్విక్‌ సాయిరాజ్‌-అశ్విని పొన్నప్ప జోడీ ఓడిపోయింది. ఇక ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ ఆశలు ఇక పీవీ సింధు, సాయి ప్రణీత్‌ లపైనే ఉన్నాయి.