ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు

మల్దకల్ ఆగస్టు 19(జనంసాక్షి)ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలలో భాగంగా ఫోటోగ్రఫీ పితామహుడు,లూయిస్ డాగురె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మండల ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేంద్ర కుమార్ శెట్టి మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్స్ అందరూ ఐక్యతతో ఉండాలన్నారు.ఎవరికి ఏ సమస్య వచ్చిన సంఘము ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.వెయ్యి మాటల కన్నా ఒక ఫోటో మిన్న అని పేర్కొన్నారు.కాలగర్భంలో కలిసిపోతున్న చరిత్రను చూపించే సజీవ సాక్ష్యం ఫోటో అన్నారు.ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్లు కృష్ణ గౌడ్ తిమ్మప్ప శేషు గౌడు రాము రంగన్న చంటి జీకే రవి తదితరులు పాల్గొన్నారు.