ప్రభుత్వం-ఆర్బీఐ మధ్య విభేదాలు లేవు: జైట్లీ
ఢిల్లీ: ప్రభుత్వం, ఆర్బీఐ మధ్య ఎలాంటి విభేదాలు లేవని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ అన్నారు. వడ్డీరేట్లు తగ్గించాలని బ్యాంకులపై ఒత్తిడి చేయలేదని పేర్కొన్నారు. బ్యాంకులు ఆర్బీఐ విధానాలను పాటిస్తాయని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ మాట్లాడుతూ… దేశంలో అకాల వర్షం వల్ల పంటలు దెబ్బతింటున్నాయి. ఆహార నిర్వహణలో జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు.