ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి వీఆర్ఏల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలి

సిఐటియూ జిల్లా అధ్యక్షులు వెంకటస్వామి

ఇటిక్యాల (జనంసాక్షి) ఆగష్టు 23 : రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని సీఐటీయూ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మండల కేంద్రంలోని తాహసిల్దార్ కార్యాలయం ఎదుట విఆర్ఏలు చేస్తున్న సమ్మె మంగళవారం 30వ రోజుకు చేరుకుంది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విఆర్ఏల రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు సిఐటియూ జిల్లా అధ్యక్షులు వెంకటస్వామి సంగీభావం తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు వీఆర్ఏ లు చేస్తున్న న్యాయమైన పోరాటనీకి తమ మద్దతు ఎప్పుడు ఉంటుందన్నారు. వీఆర్ఏల పోరాటానికి సీఐటియు తరపున పూర్తి సహకారం అందిస్తూ మీ వెంటే ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు ప్రభుదాస్ సంఘీభావం తెలియజేశారు.