ప్రభుత్వమే అసెంబ్లీని నడిపిస్తోంది: టీటీడీపీ

న్యూఢిల్లీ, మార్చి 18: టీటీడీపీ నేతలు మంగళవారం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలిసి తెలంగాణ ప్రభుత్వంపై పలు ఫిర్యాదులు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందన్నారు. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవట్లేద ని ఆరోపించారు. ప్రభుత్వమే అసెంబ్లీని నడిపిస్తోందని చెప్పారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, మహిళలకు కేబినేట్‌లో స్థానం లేకపోవడం దురదృష్టకమన్నారు.