ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అట్టహాసంగా ఫ్రెషర్స్ పార్టీ

శుక్రవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అట్టహాసంగా ఫ్రెషర్స్ పార్టీని నిర్వహించారు.విద్యార్థినీ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ప్రకాశం శెట్టి మాట్లాడుతూ జాతీయ విద్యా దినోత్సవం రోజు ఫ్రెషర్స్ పార్టీని నిర్వహించుకోవడం అరుదైన సందర్భమని, విద్యార్థినీ విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాల తరగతులకు హాజరై, మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఉన్నత విలువలతో కూడిన విద్యను అభ్యసిస్తే, జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకోవచ్చని తెలిపారు. గత సంవత్సరం ఇంటర్మీడియట్ పలితాలలో కళాశాలను జిల్లాలో మంచి ఫలితాలు సాధించిన కళాశాలగా గుర్తింపు వచ్చిందని, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో లెక్చరర్స్ వెంకటేష్, సుదర్శన్ రెడ్డి,వెంకట్ రెడ్డి,ప్రవీణ్ కుమార్,సలాం పాషా,బాలనాగరాజు,ఆనంద్,వహీదా,మురళీధర్ మరియు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.