ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోండి

తహసిల్దార్ కు వినతి
మల్దకల్అక్టోబర్20 (జనంసాక్షి) ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించుకున్న  వారిపై చర్యలు తీసుకోవాలని మండల తహసిల్దార్ హరికృష్ణకు కుర్తి రావులచెరువు గ్రామ సర్పంచ్ జయమ్మ భర్త లక్ష్మన్న వినతిపత్రం సమర్పించారు.మండల పరిధిలోని కుర్తి రావులచెరువు గ్రామ శివారులో సర్వేనెంబర్132లో కురువ ఈశ్వరన్న,సన్నాఫ్ కురువ కిష్టన్న రెండెకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేసుకున్నారని గ్రామ సర్పంచ్ జయమ్మ తెలిపారు.అనంతరం గత సంవత్సరం నుంచి ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని అట్టి భూమిని తిరిగి ప్రభుత్వానికి స్వాధీనం పరుచుకోవాలని గ్రామ సర్పంచ్ జయమ్మ కోరారు. ఈ విషయాన్ని తహసిల్దార్ వివరణ అడగక గ్రామంలో ప్రభుత్వ భూమిని గ్రామస్తులు ఎవరైనా ఆక్రమించుకున్నారని తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని,రెండు రోజులలో కబ్జా చేసిన భూమిని స్వాధీనం చేసుకుంటామని తహసిల్దార్ హరికృష్ణ తెలిపారు.
Attachments area