ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సయ్యద్‌ జాఫ్రీ ఇకలేరు

5
ముంబై,నవంబర్‌16(జనంసాక్షి): ప్రఖ్యాత బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు సయ్యద్‌ జాఫ్రీ(86) కన్నుమూశారు. ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన జాఫ్రీ అనేక అవార్డులు,రివార్డులు పొందారు.  పంజాబ్‌ రాష్ట్రం మలేర్‌కోట్లాలో జన్మించిన సయ్యద్‌ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం మృతిచెందారు. ఈయన పలు భారతీయ, బ్రిటీష్‌ సినిమాల్లో నటించారు. అమితాబ్‌బచ్చన్‌, రిషికపూర్‌ వంటి నటులతో కూడా కలిసి పనిచేశారు. గాంధీ, మాసూమ్‌, పెన్నా, రామ్‌ తేరా గంగా మైలీ, చస్మేబద్దూర్‌, కైసే నా కెహనా, జుదాయి, అజుబా వంటి చిత్రాల్లో నటించారు. 1977లో జరిగిన ఫిలిం ఫేర్‌ అవార్డ్స్‌లో ‘ది చెస్‌ /-లపేయర్స్‌’ చిత్రంలో జాఫ్రీ నటనకు ‘ఉత్తమ సహాయ నటుడు’ పురస్కారం లభించింది. ఇదే చిత్రానికి సత్యజిత్‌ రే ‘ఉత్తమ దర్శకుడు’గా పురస్కారం అందుకున్నారు. జాఫ్రీ మృతి పట్ల పలువురు బాలీవుడ్‌, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.