ప్రముఖ రచయిత సునీల్‌ గంగోపాధ్యాయ ఇకలేరు

కోల్‌కత్త: ప్రముఖ బెంగాలీ రచయిత, సాహిత్య అకాడమీ అధ్యక్షుడు సునీల్‌ గంగోపాధ్యాయ(78) ఈ రోజు ఉదయం కోత్‌కతాంతలో కన్ను మూశారు. సెప్టెంబర్‌ 7,1934లో ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉన్న ఫరీద్‌పూర్‌లో ఆయన జన్మించారు. 200 పైగా రయనలు చేశారు. క్రిట్టిబాన్‌ అనే సాహిత్య పత్రికను 1953లో స్ధాపించారు.పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం అయన్ను పలు అవార్డులతో సత్కరించింది.