ప్రయాణికుడ్ని కాల్చి పరారయ్యారు

చెన్నై: బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తిని తుపాకీతో కాల్చి చంపిన ఘటనబుధవారం ఉదయం జరిగింది. ఈ ఘటన తమిళనాడులోని సత్తూర్‌లో చోటుచేసుకుంది. చెన్నైకి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో బస్సులో వెళ్తున్న ఓ ప్రయాణికుడిపై ఇద్దరు వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరిపి పారిపోయారు. ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో బస్సులోని ప్రయాణికులు భయాందోళనలకు గురై పరుగులు తీశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.