*ప్రశాంతంగా ముగిసిన కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష*

పెద్దేముల్ ఆగస్టు 28 (జనం సాక్షి)
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష పెద్దేముల్ మండలంలో ప్రశాంతంగా ముగిసింది. పరీక్ష కేంద్రాలను తాండూర్ రూరల్ సీఐ రాంబాబు పరిశీలించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్దేముల్ ఎస్సై అబ్దుల్ రవూఫ్ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదివారం మండలంలోని 4 పరీక్ష కేంద్రాల్లో 720 అభ్యర్థులు పరీక్ష రాసేందుకు గాను 666 మంది అభ్యర్థులు హాజరైనట్లు, సంబంధిత అధికారులు తెలియజేశారు. పెద్దేముల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో 14 మంది, జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో 16 మంది, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 13 మంది,  మంబాపూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో 11 మంది,మొత్తం 54 మంది అభ్యర్థులు గైరాజైనట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. పరీక్ష కేంద్రానికి గంట  ముందుగానే రావాలని, నిమిషం ఆలస్యమైన అనుమతించబోమని స్పష్టం చేశారు. దౌల్తాబాద్ మండలానికి చెందిన నిఖిల్, కుల్కచర్ల మండలానికి చెందిన నాగరాజు నిమిషం ఆలస్యం కారణంగా పరీక్ష రాయలేకపోయారు.