ప్రహరీ గోడ పనులు ప్రారంభించిన సర్పంచ్..

ఊరుకొండ, నవంబర్ 11 (జనంసాక్షి):
ఊరుకొండ మండల పరిధిలోని ఊరుకొండపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొన్ని సంవత్సరాల నుండి కొంతమేర ప్రహరీ గోడ లేక ఇబ్బందులు అవుతున్న క్రమంలో సుమారుగా 230 మీటర్ల మేర ప్రహరీగోడ పనులను శుక్రవారం గ్రామ సర్పంచ్ దండోత్కర్ అనితనాగోజి ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరి – మనబడి కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలు ప్రైవేట్ స్కూల్లకు దీటుగా అభివృద్ధి జరగాలని ప్రభుత్వ పాఠశాలలు సరికొత్త హంగులతో తీర్చిదిద్దేక్రమంలో హైస్కూల్ లో మన ఊరి మనబడి కార్యక్రమంలో నిర్మాణం చేపడుతున్న డైనింగ్ హల్ పనులను సర్పంచ్ పరిశీలించారు. కార్యక్రమంలో అశోక్ రెడ్డి, అరిఫ్, తదితరులు పాల్గొన్నారు.