ప్రాంతీయవాదంతో తప్పుడు నివేదికలు: గోపాల్రెడ్డి
హైదరాబాద్, జనంసాక్షి: ప్రాంతీయవాదంతోనే తప్పుడు నివేదికలు ఇచ్చారని ఏపీఎన్టీఓ అధశ్యక్షుడు గోపాల రెడ్డి తెలిపారు. నాపై నమోదైన కేసులపై హైకోర్టులను ఆశ్రయిస్తానని ఆయన చెప్పారు. ఏపీఎన్టీఓ హౌజింగ్ సొసైటీ అక్రమాలపై కోఆపరేటివ్ సొసైటీ రిజిస్ట్రార్ హరి అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధ్యక్షుడు గోపాల రెడ్డి 13 కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడినట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.