ప్రాణాలు పోయాల్సిన డాక్టర్.

Maharashtra-serial-killer-doctor-Santosh-Polప్రాణాలు పోయాల్సిన డాక్టర్.. అవయవాల దందా నడుపుతూ ఆరుగురి ప్రాణాలు పొట్టన బెట్టుకున్నాడు. మహారాష్ట్రకు చెందిన సంతోష్ పాల్ అనే డాక్టర్…తన వద్దకు వైద్యం కోసం వచ్చిన వారిని చంపి, వారి అవయవాలను అమ్ముకున్నాడు. ఓ మహిళ మిస్సింగ్ కేసులో తీగ లాగితే….ఈ డాక్టర్ డొంక కదిలింది. 2003 నుంచి ఇప్పటి వరకు నలుగురు మహిళలను, ఒక పురుషుడిని హత్య చేసి తన ఫామ్ హౌజ్‌లోనే పూడ్చి పెట్టాడు ఈ డాక్టర్. ఇతనికి ఒక నర్సు కూడా సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. శవాలను పాతి పెట్టిన ప్లేస్ లో తవ్వకాలు చేపట్టారు.