ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటిన ఎంపీపీ స్నేహ

ఇటిక్యాల (జనంసాక్షి) ఆగస్టు 21: మండల పరిధిలోని షేక్ పల్లె గ్రామంలో 75వ స్వాతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఆదివారం ఎంపీపీ జి. స్నేహ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె భాగస్వాములై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాలలో ప్రభుత్వ ఖాళి స్థలాల్లో మొక్కలు నాటి సంరక్షించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు.