ప్రెస్ క్లబ్ ఎన్నికలు నిర్వహించాలని కలెక్టర్ కు వినతి

మహబూబ్ నగర్ ప్రెస్ క్లబ్ కి ఎన్నికలు నిర్వహించాలని  టియుడబ్ల్యూజే (ఐజేయూ)ఆధ్వర్యంలో జర్నలిస్ట్ లు శుక్రవారం  జిల్లా కలెక్టర్ ఎస్ . వెంకట్ రావు ను కలిసి వినతి పత్రం అందచేశారు.
 ప్రెస్ క్లబ్ కి ఎన్నికలు నిర్వహించి అలాగే  అధికారిక ప్రెస్ క్లబ్ కమిటీని ఏర్పాటు చేయాలని జిల్లా  కలెక్టర్ కు విజ్ఞప్తి చేసారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ లు ప్రెస్ క్లబ్ కి సంబంధించి కొన్ని వివరాలను కలెక్టర్ కు  వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్  ఎస్ . వెంకట్ రావు ప్రెస్ క్లబ్ నిర్వహణపై చర్యలకు సానుకూలంగా స్పందించారు .ఈ కార్యక్రమంలో  టియుడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా సంఘం నాయకులు దతేందర్, బీజే రామాంజనేయులు, శేఖర్ గౌడ్(జెమిని శేఖర్)   వెంకటయ్య తదితరులు ఉన్నారు .