పవన్ కళ్యాణ్తో కుమారస్వామి భేటీ
హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్తో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి సమావేశమయ్యారు. ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యం లేదని పవన్కల్యాణ్ చెప్పారు. 8 ఏళ్ల నుంచి కుమారస్వామితో నాకు అనుబంధం ఉందని పవన్కల్యాణ్ తెలిపారు. కుమారస్వామి కుమారుడు నిఖిల్ సినీ ప్రవేశం గురించి చర్చించామని పవన్ అన్నారు. కృష్ణా పుష్కరాలకు వెళ్లడం లేదని పవన్కల్యాణ్ అన్నారు. ఏపీ ప్రత్యేక హోదా అంశంపై తర్వాత మాట్లాడతానని పవన్కల్యాణ్ చెప్పారు. నిఖిల్ సినీరంగ ప్రవేశం గురించి పవన్ కల్యాణ్తో చర్చించానని కుమారస్వామి తెలిపారు. నిఖిల్ను పవన్ సొంత సోదరుడిగా భావిస్తారని ఆశిస్తున్నా అని కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి అన్నారు. కర్ణాటక, తెలంగాణ, ఏపీ ప్రజలు అన్నదమ్ముల్లాంటివారని ఆయన అన్నారు. ఏపీ రాజకీయాల్లో పవన్ ప్రాధాన్యత ఉంటుందని కుమారస్వామి వెల్లడించారు.