ఫిలిప్పైన్స్‌లో భూకంపం…

636085825578547467భయంతో పరుగులు తీసిన జనం

న్యూఢిల్లీ : ఫిలిప్పైన్స్ దక్షిణ ప్రాంతంలో ప్రజలు ఆదివారం తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. మిండనావో ద్వీపం భూకంపంతో వణికిపోయింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదైంది. హఠాత్తుగా కుర్చీలు, బెంచీలు, సామగ్రి కదులుతుండటంతో ప్రజలు అవకాశం ఉన్న మార్గంలో ఇళ్ళ నుంచి బయటికి వచ్చేశారు. హినాత్యువాన్ పట్టణానికి వాయవ్యంగా 12 కి.మీ. దూరంలో 10 కి.మీ. లోతులో ఈ భూకంపం ఏర్పడింది. ఈ దుర్ఘటనలో ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు. సునామీ హెచ్చరికలు కూడా లేవు.