ఫీల్డ్ అసిస్టెంట్ లను తిరిగి విధుల్లోకి తీసుకోవడం హర్షనీయం

ఎంపీపీ ఓలం చంద్రమోహన్
కేసముద్రం ఆగస్టు 11 జనం సాక్షి / గతంలో పనిచేసిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ లను తిరుగు విధుల్లోకి తీసుకోవడం పట్ల కేసముద్రం మండల ఎంపీపీ ఓలం చంద్ర మోహన్  హర్షం వ్యక్తం చేశారు వారు మాట్లాడుతూ… ఫీల్డ్ అసిస్టెంట్ లు విధుల్లో చేరడం ద్వారా గ్రామాల్లో ఎక్కువగా ఉపాధి పనులు జరిగే అవకాశం ఉందన్నారు. అలాగే పంచాయతీ కార్యదర్శులకు పని భారం తగ్గుతుందన్నారు ఫీల్డ్ అసిస్టెంట్ ను విధుల్లోకి తీసుకున్న ముఖ్యమంత్రి, గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి  కమటం శ్రీనివాస్, టిఆర్ఎస్ కేసముద్రం పట్టణ అధ్యక్షులు వీరు నాయక్, ఇంటికన్నె సర్పంచ్ గణపారపు సరిత రమేష్, తెలంగాణ  శ్రీనివాస్ నాయక్,ఫీల్డ్ అసిస్టెంట్ యూనియన్ రాష్ట్ర నాయకులు మంచాల కుమార్, కేసముద్రం  ఫీల్డ్ అసిస్టెంట్ యూనియన్ అధ్యక్షులు నానబాల రమేష్,ఫీల్డ్ అసిస్టెంట్లు శ్రీనివాస్  ,మల్లయ్య ,సంజీవ, రవి, రమేష్, శ్రీనివాస్ ,లావణ్య, ఉమా  తాహేర ,రమేష్ ,అనిల్ కుమార్, రాజశేఖర్ ,రజిత తదితరులు పాల్గొన్నారు.