ఫోటోగ్రాఫర్లు టెక్నాలజీకి అనుగుణంగా మార్పు చెందాలి: వైస్ ఎంపీపీ ఎడవల్లి దిలీప్ రెడ్డి

మండల కేంద్రంలో ఉమ్మడి అనుముల మండల ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 18 నుంచి 20వ తేది వరకు హైదరాబాదులో జరిగే ఫోటో ట్రేడ్ ఎక్స్ పో గోడ పత్రికను తిరుమలగిరి (సాగర్) మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షుడు ఎడవల్లి దిలీప్ రెడ్డి బుధవారం ఆవిష్కరించాడు. అనంతరం ఆయన మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీ ని అందుపుచ్చుకోవాలని, మార్పులకు అనుగుణంగా ఫోటోగ్రాఫర్లు టెక్నాలజీని ఉపయోగించి అభివృద్ధి చెందాలని సూచించాడు. కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పసుపులేటి కృష్ణ, మండల ఉపాధ్యక్షుడు సర్దార్ నాయక్ ,ప్రధాన కార్యదర్శి నాగార్జున, లింగాల సైదులు, ప్రశాంత్, నవీన్ ప్రభాకర్ సురేష్, చవ్వా నవీన్, శంకర్, చందు తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్: గోడపత్రిక ఆవిష్కరిస్తున్న వైస్ ఎంపీపీ ఎడవల్లి దిలీప్ రెడ్డి