ఫోటో ఎక్స్పో విజయవంతం చేయండి

మల్దకల్ నవంబర్ 10 (జనం సాక్షి)ఈనెల 18 19 తేదీల్లో హైదరాబాదులో జరిగే ఫోటో ఎక్స్పో కార్యక్రమాన్ని ఫోటోగ్రాఫర్లందరూ విజయవంతం చేయాలని  జిల్లా ఫోటోగ్రఫీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ ఎస్ శేఖర్ కోరారు.గురువారం జిల్లా కేంద్రంలోని ఫోటో వీడియో గ్రాఫర్ల అసోసియేషన్ కార్యాలయంలో గోడపత్రిక విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహ శెట్టి ఉపాధ్యక్షుడు కొంకతి వెంకటేష్, గౌరవ అధ్యక్షుడు కృష్ణంరాజు, టౌన్ ప్రధాన కార్యదర్శి నరసింహ ,టౌన్ ఉపాధ్యక్షుడు వీరేష్ ,జిల్లా కోశాధికారి వేణు,ఇటిక్యాల మండల ఉపాధ్యక్షుడు రేమత్, జిల్లా కార్యవర్గ సభ్యులు నరసింహ,వెంకటేష్,అంజి, పండు,హర్ష ,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.