ఫోటో వీడియో గ్రాఫర్స్ జిల్లా అధ్యక్షుని సన్మానించిన జిల్లా కార్యవర్గ సభ్యులు

గద్వాల నడిగడ్డ అక్టోబర్ 23 (జనంసాక్షి) జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని ఆదివారం ఫోటో వీడియో గ్రాఫర్స్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు ఎస్ఎస్ శేఖర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. త్వరలో జరగబోయే ఫోటో వర్క్షాప్ పై సమీక్షించారు. జిల్లాలోని ఫోటో వీడియో గ్రాఫర్లు సభ్యత నమోదు, కుటుంబ భరోసా ఇన్సూరెన్స్ చేసుకోవాలని ముడి సరుకులు  పెరగడంతో ఫోటో వీడియో రేట్లను పెంచడం జరుగుతుందని,వాటిని వచ్చే నెల నుండి అమలులోకి వస్తాయని జిల్లా అధ్యక్షుల తెలిపారు.అనంతరం నూతనంగా ఇటీవల ఎన్నికైన జిల్లా అధ్యక్షుడు ఎస్ఎస్ శేఖర్, ఉపాధ్యక్షుడురామకృష్ణ ,గౌరవ అధ్యక్షుడు కృష్ణంరాజును జిల్లా కార్యవర్గ సభ్యులు శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు  కొంకతి వెంకటేష్ ,జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహయ్య శెట్టి , కోశాధికారి వేణు,జిల్లా మీడియా ఇన్ఛార్జి గోవిందు, కార్యవర్గ సభ్యులు ముని, తిరుమలేష్ ,రాజు ,నరసింహ, మస్తాన్, ప్రసాద్ ,అంజి, రహమత్ ,దౌలు ,జాన్ రవి, తదితరులు పాల్గొన్నారు.