ఫ్రీడం కప్ ఆట పోటీలు ప్రారంభం

,బహుమతులు ప్రధానం

 

మల్దకల్ ఆగస్టు 18 (జనంసాక్షి) స్వతంత్ర భారత్ వజ్రోత్సవాలలో భాగంగా గురువారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్రీడా పోటీలు నిర్వహించారు.ఈ క్రీడోత్సవాలకుగ్రామ సర్పంచ్ యాకోబు,స్కూల్ చైర్మన్ పూజారి తిమ్మప్ప, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇమ్మనియాల్ ,మండల పీడీ సుహాసిని,పీఈటీలు వెంకట్ రాములు,రత్నమాల, రాజేశ్వరి,ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది.కబడ్డీ, కోకో, వాలీబాల్ ,బాల బాలికలకు, పోటీలు నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ యాకోబు మాట్లాడుతూ పిల్లల మానసిక ఉత్సాహాన్ని క్రీడలు నింపుతాయని తెలిపారు.
క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రధానోత్సవానికి ముఖ్యఅతిథిగా ఏఎస్ఐ ఈశ్వరయ్య, మండల విద్యాధికారి కొండారెడ్డి, వైస్ ఎంపీపీ వీరన్న ప్రధానోపాధ్యాయులు ఇమ్మానియేల్ బహుమతులను ప్రధానం చేశారు