బంగారు తెలంగాణ అని మోసం చేస్తున్న కేసిఆర్

యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం జనం సాక్షి న్యూస్ ఫిబ్రవరి 20

బంగారు తెలంగాణ అని చెప్పి తెలంగాణ ప్రజలను కేసిఆర్ మోసం చేస్తున్నాడని టీపిసిసి జిల్లా ప్రధాన కార్యదర్శి , ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి బీర్ల ఐలయ్య అన్నారు. సోమవారం ఆలేరు హత్ సే హత్ జోడో యాత్రలో భాగంగా తుర్కపల్లి మండలం గందమల్ల, ఇంద్రనగర్,శ్రీనివాస్ పూర్, కొండాపూర్, గోపాల్ పూర్, తిర్మలపుర్ గ్రామాల్లో కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో
కాంగ్రెస్ అధికారం లోకి రాగానే రెండు లక్షల రైతు రుణ మాఫీ చేస్తనని,రైతులకు, కౌలు రైతులకు ఎకరాకు పదిహేను వెలు పెట్టుబడి సహాయం చేస్తానని , గ్యాస్ సిలిండర్ ఐదువందల కే అందిస్తామని, పండించిన పంటలన్నిటిని మద్దతు ధరతో కొంటమని ,ధరణి పోర్టల్ రద్దు చేస్తామని, అర్హులైన అందరికీ పెన్షన్లు అందజేస్తామని, రెండులక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో మండలపార్టీ అధ్యక్షుడు ధనవత్ శంకర్ నాయక్,బ్లాక్ ప్రెసిడెంట్ గుడిపాటి మధుసూధన్ రెడ్డి,జిల్లా ఉపాధ్యక్షుడు వెలగలరాజయ్య , ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ధనావత్ భాస్కర్ నాయక్,మండల ప్రధాన కార్యదర్శి చాడా భాస్కర్ రెడ్డి , ఓ బిసి జిల్లా అధ్యక్షుడు గోద రాహుల్ గౌడ్ , ప్రధాన కార్యదర్శి పవన్ రాజ్ ,యాదగిరి గుట్ట మండల పార్టీ అధ్యక్షుడు బాలరాజు, ఎంపిటిసి లు కానుగంటి శ్రీనివాస్ యాదవ్,మోహన్ బాబు,మండల మహిళా అధ్యక్షురాలు అయినాల చేతన్యా మహేందర్ రెడ్డి, ఎన్ఎస్ యూఐ నాయకులు గడ్డమిది నిఖిల్ గౌడ్, నాయకులు బోరెడ్డి హనుమంత రెడ్డి,సోమల్ల వెంకటేష్, రాజేష్ నాయక్, ఆకుల సతీష్, కొన్ని దుర్వాసులు ,సింగం శ్రీను తదితరులు పాల్గొన్నారు