బతుకమ్మ ఎత్తిన జడ్పిటిసి జాదవ్ అశ్విని.

రాయికల్, అక్టోబర్ 27 (జనంసాక్షి) మండలంలోని ఇటిక్యాల గ్రామంలో బుధవారం అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బతుకమ్మ సంబరాల్లో జెడ్పిటిసి జాదవ్ అశ్విని మహిళలతో కలిసి బతుకమ్మ ఊరేగింపులో పాల్గొన్నారు. గ్రామంలోని ప్రధాన కూడల్లలో మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సామల్ల లావణ్య వేణు, మండల ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ చంద్రశేఖర్, మహిళలు, యువకులు పాల్గొన్నారు.