బల్గెరలో గొర్రెలు,మేకలకు ఉచిత వైద్యశిబిరం మంగళావారం ప్రారంభించిన గట్టు మండల

సర్పంచుల సంఘం అధ్యక్షులు బాసు హనుమంతు నాయుడు
అగస్టు 30 (జనంసాక్షి) గట్టు మండల పరిదిలోని
బల్గెర గ్రామంలో గొర్రెలలో, మేకలలో సీజనల్ గా వచ్చే కాలిపుండు వ్యాధి,నీలినాలుక వ్యాధి , ప్రురు రోగం ఇతర వ్యాధులకు రాకుండా ఉచిత వైద్య శిబిరం ద్వారా కాపరులకు మందుల పంపిణీ చేసిన గట్టు మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు బాసు హనుమంతు నాయుడు. ఉచిత వైద్యశిబిరంకు ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం నుండి వచ్చే మందులను సద్వినియోగం చేసుకొని, ఆర్థికంగా లబ్ధి పొందాలని కాపారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో డాక్టరు శ్రీకాంత్, ఎమ్.పి.టి.సి రుపవతి కిష్టప్ప,
మాజీ సర్పంచ్ సామేలు, వార్డ్ మెంబ్లరు, పశువైద్య సిబ్బంది ,మౌలాలి, మద్దిలేటి,కనకరాజు, పృథ్వి, ఖాజా, భీమన్న,రైతులు, కాపరులు  గ్రామస్తులు తది తరులుపాల్గొన్నారు.