బహిరంగ సభకు బయలుదేరిన బిజెపి నాయకులు .

మల్లాపూర్ ,( జనంసాక్షీ) ఆగస్టు:27 ఈరోజు మల్లాపూర్ మండలం నుండి హన్మకొండలో జరిగే బిజెపి బహిరంగ సభకు మల్లాపూర్ మండల అధ్యక్షుడు ముద్దం సత్యనారాయణ గౌడ్ గారి ఆద్వర్యంలో సుమారు మూడు వందల మందితో బయల్దేరుతున్న బస్సులను జెండా ఊపి ప్రారంబిస్తున్న సాతారం ఎంపిటీసి గున్నాల శ్రీనివాస్. ఈ సభ కు బయల్దేరుతున్నా వారిలో గుండంపల్లి ఉపసర్పంచ్ మల్లాపూర్ వేణు,మల్లాపూర్ బిజెపి ఉపాద్యాక్షులు గుయ్య మల్లేష్ యాదవ్,మండల ఐటిసెల్ కన్వీనర్ బండారి వెంకటేష్, ఓబిసి మండల మోర్చా అధ్యక్షుడు సుదగోని శ్రీనివాస్,రేగుంట గ్రామ శాఖ అధ్యక్షుడు తాటిపాముల గోవర్దన్ మరియు శక్తి కేంద్రాల ఇంచార్జులు,బూత్ కమిటీ నాయకులు ఉన్నారు.